ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి బయోపిక్‌.. ఎప్పుడొస్తుందో చెప్పేసిన నిర్మాత అల్లు అరవింద్‌!

ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి బయోపిక్‌.. ఎప్పుడొస్తుందో చెప్పేసిన నిర్మాత అల్లు అరవింద్‌!

MS Subbulakshmi Biopic Producer Allu Aravind Reveals Release Update
  • 2027 ఆగస్టు తర్వాత విడుదలయ్యే అవకాశం
  • రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటన
  • గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా
  • సంగీతం అందించనున్న అనిరుధ్‌
  • మానవీయ కోణంలో ఆమె జీవితాన్ని చూపించనున్న టీమ్‌
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, భారతరత్న అవార్డు గ్రహీత ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి జీవితంపై తెరకెక్కుతున్న బయోపిక్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఎంఎస్‌ - ఏ లెగసీ ఆన్‌ స్క్రీన్‌’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీపై నిర్మాత అల్లు అరవింద్‌ కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. వచ్చే ఏడాది ఆగస్టు తర్వాత ఎప్పుడైనా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

చెన్నైలోని మ్యూజిక్‌ అకాడమీలో జరిగిన సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అల్లు అరవింద్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అనిరుధ్‌ సంగీతం అందించనున్నారు.

ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి జీవితాన్ని కేవలం ఓ గొప్ప గాయని కథగా కాకుండా.. ఆమె వ్యక్తిగత జీవితంలోని మానవీయ కోణాన్ని చూపించాలనుకుంటున్నట్లు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి తెలిపారు. ఇందుకోసం తమ బృందం ఏడాదిగా ఆమె జీవితంపై పరిశోధన చేస్తోందని చెప్పారు.

ఆమె సాధించిన భారతరత్న, ప్రపంచవ్యాప్తంగా చేసిన కచేరీలు మాత్రమే కాకుండా.. ఓ కుమార్తెగా, కళాకారిణిగా, మహిళగా ఆమె ఎదుర్కొన్న విజయాలు, వైఫల్యాలు, త్యాగాలను సినిమాలో చూపించనున్నట్లు తెలిపారు.

నేటి తరం యువతకు ఆమె జీవితం ఎంతో స్ఫూర్తినిస్తుందని గౌతమ్‌ అన్నారు. ప్రస్తుతం లైక్స్‌, షేర్స్‌, సబ్‌స్క్రైబర్లతో విజయాన్ని కొలుస్తున్న పరిస్థితుల్లో.. ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి క్రమశిక్షణ, సహనంతో జీవితకాలంలో సాధించిన గొప్పతనం యువతకు బలమైన సందేశమని పేర్కొన్నారు.

గీతా ఆర్ట్స్‌, రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, బన్నీ వాస్‌ వర్క్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Advertisement
MS Subbulakshmi
Allu Aravind
Rashmika Mandanna
Gowtam Tinnanuri
MS Subbulakshmi Biopic
MS A Legacy On Screen

More Telugu News