తెలుగు రాష్ట్రాల్లో సెలవు తేదీ మార్పు.. మిలాద్ ఉన్ నబీ ఎప్పుడంటే..?
- ఏపీలో మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు
- గతంలో ఆగస్టు 25న సెలవుగా ప్రకటన
- తాజాగా ఆగస్టు 26, బుధవారానికి సెలవు మార్పు
- ముస్లిం మత పెద్దల అభ్యర్థన మేరకు నిర్ణయం
- తెలంగాణలోనూ ఆగస్టు 26నే మిలాద్ ఉన్ నబీ
ఆంధ్రప్రదేశ్లో మిలాద్ ఉన్ నబీ ప్రభుత్వ సెలవు తేదీని మార్చారు. గతంలో ఆగస్టు 25న సెలవుగా ప్రకటించగా.. తాజాగా ఆగస్టు 26, బుధవారానికి మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముస్లిం మత పెద్దల అభ్యర్థన, నూతన చంద్ర దర్శనాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా మిలాద్ ఉన్ నబీ సెలవును ఆగస్టు 26కే ఖరారు చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే రోజు ఈ పండగకు ప్రభుత్వ సెలవు అమల్లో ఉండనుంది.