భారత నౌకను ఢీకొన్న పాక్ నౌక.. ఇస్లామాబాద్ రాయబారికి సమన్లు
- అంతర్జాతీయ జలాల్లో సెప్టెంబరు 15న ఘటన
- ఘటనలో పెద్దగా నష్టం జరగలేదన్న భారత వర్గాలు
- పాక్ రాయబారికి భారత్ సమన్లు
- పాక్ నౌక వ్యవహారంపై తీవ్ర నిరసన
- 1991 ఒప్పందం ఉల్లంఘించిందన్న భారత్
అరేబియా సముద్రంలో భారత నౌకాదళానికి చెందిన ఓ నౌకను పాకిస్థాన్ నేవీకి చెందిన నౌక ఢీకొన్న ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్ సాద్ అహ్మద్ వారైచ్ను బుధవారం విదేశాంగ శాఖ పిలిపించి నిరసన తెలిపింది. పాకిస్థాన్ నౌకాదళ యూనిట్ వ్యవహరించిన తీరు ‘‘ఆమోదయోగ్యం కానిది, వృత్తిపరమైన ప్రమాణాలకు విరుద్ధం’’ అని భారత్ పేర్కొంది.
ఈ ఘటన సెప్టెంబరు 15 సాయంత్రం ఉత్తర అరేబియా సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో జరిగినట్లు సమాచారం. సాధారణ నిఘా విధుల్లో ఉన్న భారత నౌకకు పాకిస్థాన్ నౌక వేగంగా సమీపించి, సురక్షితం కాని రీతిలో దిశ మార్చుకుంటూ రావడంతో ఢీకొన్నట్లు భారత వర్గాలు తెలిపాయి. ఘటనలో పెద్దగా నష్టం జరగలేదని పేర్కొన్నాయి.
పాకిస్థాన్ నౌక వ్యవహరించిన తీరు 1991లో భారత్, పాకిస్థాన్ మధ్య కుదిరిన సైనిక విన్యాసాలు, కదలికలకు ముందస్తు సమాచారం ఇచ్చే ఒప్పందంలోని ఆర్టికల్ 10కు విరుద్ధంగా ఉందని విదేశాంగ శాఖ తెలిపింది.
ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా పాకిస్థాన్ సైనిక యూనిట్లు సముద్రంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలను గౌరవించాలని ఆ దేశ రాయబారికి భారత్ సూచించింది. ఈ సందేశాన్ని పాకిస్థాన్ విదేశాంగ శాఖకు చేరవేయాలని ఆదేశించింది.
ఇదే సమయంలో ఇస్లామాబాద్లోని భారత చార్జ్ డి అఫైర్స్కు కూడా పాకిస్థాన్ విదేశాంగ శాఖకు అధికారికంగా నిరసన తెలియజేయాలని కేంద్రం సూచించింది.
ఈ ఘటన సెప్టెంబరు 15 సాయంత్రం ఉత్తర అరేబియా సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో జరిగినట్లు సమాచారం. సాధారణ నిఘా విధుల్లో ఉన్న భారత నౌకకు పాకిస్థాన్ నౌక వేగంగా సమీపించి, సురక్షితం కాని రీతిలో దిశ మార్చుకుంటూ రావడంతో ఢీకొన్నట్లు భారత వర్గాలు తెలిపాయి. ఘటనలో పెద్దగా నష్టం జరగలేదని పేర్కొన్నాయి.
పాకిస్థాన్ నౌక వ్యవహరించిన తీరు 1991లో భారత్, పాకిస్థాన్ మధ్య కుదిరిన సైనిక విన్యాసాలు, కదలికలకు ముందస్తు సమాచారం ఇచ్చే ఒప్పందంలోని ఆర్టికల్ 10కు విరుద్ధంగా ఉందని విదేశాంగ శాఖ తెలిపింది.
ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా పాకిస్థాన్ సైనిక యూనిట్లు సముద్రంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలను గౌరవించాలని ఆ దేశ రాయబారికి భారత్ సూచించింది. ఈ సందేశాన్ని పాకిస్థాన్ విదేశాంగ శాఖకు చేరవేయాలని ఆదేశించింది.
ఇదే సమయంలో ఇస్లామాబాద్లోని భారత చార్జ్ డి అఫైర్స్కు కూడా పాకిస్థాన్ విదేశాంగ శాఖకు అధికారికంగా నిరసన తెలియజేయాలని కేంద్రం సూచించింది.