రాహుల్ ద్రవిడ్ యజమానిలా వ్యవహరిస్తున్నారు.. విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- డబ్లిన్ గార్డియన్స్ యజమాని రాహుల్ ద్రవిడ్
- తొలి ఐదు మ్యాచ్ల్లో జట్టుకు దక్కని విజయం
- అయినా ద్రవిడ్ జట్టుకు పూర్తి మద్దతిచ్చారని తెలిపిన కోచ్ విక్రమ్ రాథోడ్
- జట్టు నిర్ణయాల్లో ద్రవిడ్ జోక్యం చేసుకోవడం లేదని వెల్లడి
- రోజువారీ క్రికెట్ వ్యవహారాలను అశ్విన్ చూస్తున్నారన్న విక్రమ్
భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ సాధారణంగా కోచ్గా కనిపిస్తారు. కానీ యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ఈటీపీఎల్)లో ఆయన కొత్త పాత్రలో కనిపిస్తున్నారు. డబ్లిన్ గార్డియన్స్ ఫ్రాంచైజీ యజమానిగా వ్యవహరిస్తున్నారు. అయితే జట్టు తొలి ఐదు మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా సాధించలేదు. అయినా ద్రవిడ్ ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని ఆ జట్టు కోచ్ విక్రమ్ రాథోడ్ తెలిపారు.
టీమిండియా, ఐపీఎల్లో ద్రవిడ్తో కలిసి పనిచేసిన రాథోడ్కు ఆయన్ను యజమాని పాత్రలో చూడటం కొత్త అనుభవం. ‘‘రాహుల్ యజమానిలా వ్యవహరిస్తున్నారు. పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. తొలి దశలో మేం ఐదు మ్యాచ్లు ఆడినా ఒక్కటి కూడా గెలవలేదు. అయినా ఆయన పూర్తిగా మాకు మద్దతుగా నిలిచారు’’ అని రాథోడ్ చెప్పారు.
కోచ్గా జట్లపై ఎలాంటి ఒత్తిడి ఉంటుందో ద్రవిడ్కు బాగా తెలుసని అన్నారు. ఫలితాలు అనుకున్నట్లు రాకపోయినా ఎలా స్పందించాలో ఆయనకు అవగాహన ఉందన్నారు.
డబ్లిన్ గార్డియన్స్లో రవిచంద్రన్ అశ్విన్ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని రాథోడ్ వెల్లడించారు. ప్రత్యర్థులపై వ్యూహాలు, జట్టు ఎంపిక వంటి రోజువారీ క్రికెట్ వ్యవహారాలను ప్రధానంగా అశ్విన్ చూసుకుంటున్నారని తెలిపారు.
అశ్విన్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లపై అపారమైన అవగాహన ఉందని రాథోడ్ చెప్పారు. ‘‘అతడిని క్రికెట్ అభిమాని అని పిలుస్తాను. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఆటగాళ్లను, ఎన్ని మ్యాచ్లను గమనిస్తాడో ఆశ్చర్యంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
భారత క్రికెట్లోనే ఎక్కువ కాలం పనిచేసిన తనకు ఈటీపీఎల్ కొత్త అనుభవమని రాథోడ్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అశ్విన్ జట్టులో ఉండటం ఎంతో ఉపయోగపడుతోందన్నారు. స్థానిక పరిస్థితులు, ఆటగాళ్ల సామర్థ్యంపై అశ్విన్కు ఉన్న అవగాహన తన పనిని మరింత సులభం చేసిందని చెప్పారు.
టీమిండియా, ఐపీఎల్లో ద్రవిడ్తో కలిసి పనిచేసిన రాథోడ్కు ఆయన్ను యజమాని పాత్రలో చూడటం కొత్త అనుభవం. ‘‘రాహుల్ యజమానిలా వ్యవహరిస్తున్నారు. పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. తొలి దశలో మేం ఐదు మ్యాచ్లు ఆడినా ఒక్కటి కూడా గెలవలేదు. అయినా ఆయన పూర్తిగా మాకు మద్దతుగా నిలిచారు’’ అని రాథోడ్ చెప్పారు.
కోచ్గా జట్లపై ఎలాంటి ఒత్తిడి ఉంటుందో ద్రవిడ్కు బాగా తెలుసని అన్నారు. ఫలితాలు అనుకున్నట్లు రాకపోయినా ఎలా స్పందించాలో ఆయనకు అవగాహన ఉందన్నారు.
డబ్లిన్ గార్డియన్స్లో రవిచంద్రన్ అశ్విన్ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని రాథోడ్ వెల్లడించారు. ప్రత్యర్థులపై వ్యూహాలు, జట్టు ఎంపిక వంటి రోజువారీ క్రికెట్ వ్యవహారాలను ప్రధానంగా అశ్విన్ చూసుకుంటున్నారని తెలిపారు.
అశ్విన్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లపై అపారమైన అవగాహన ఉందని రాథోడ్ చెప్పారు. ‘‘అతడిని క్రికెట్ అభిమాని అని పిలుస్తాను. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఆటగాళ్లను, ఎన్ని మ్యాచ్లను గమనిస్తాడో ఆశ్చర్యంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
భారత క్రికెట్లోనే ఎక్కువ కాలం పనిచేసిన తనకు ఈటీపీఎల్ కొత్త అనుభవమని రాథోడ్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అశ్విన్ జట్టులో ఉండటం ఎంతో ఉపయోగపడుతోందన్నారు. స్థానిక పరిస్థితులు, ఆటగాళ్ల సామర్థ్యంపై అశ్విన్కు ఉన్న అవగాహన తన పనిని మరింత సులభం చేసిందని చెప్పారు.