అగ్ని-1 క్షిపణి ప్రయోగం సక్సెస్.. రైలు నుంచీ ప్రయోగించే సామర్థ్యం సాధించిన భారత్
- అగ్ని-1 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం
- ఒడిశాలోని చాందీపూర్ నుంచి శుక్రవారం ఈ పరీక్ష నిర్వహణ
- రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం కూడా సక్సెస్
- రైలు ద్వారా క్షిపణిని ప్రయోగించే సామర్థ్యం సాధించిన కొద్ది దేశాల జాబితాలో భారత్
- డీఆర్డీఓ, సైనిక బలగాలను అభినందించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
ఇదిలా ఉండగా, భారత్ ఇటీవలే క్షిపణి ప్రయోగాల్లో సరికొత్త సామర్థ్యాన్ని సాధించింది. గతేడాది సెప్టెంబర్ 24న, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో), ఎస్ఎఫ్సీ సంయుక్తంగా 'అగ్ని-ప్రైమ్' క్షిపణిని రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి విజయవంతంగా ప్రయోగించాయి. దేశంలో ఈ తరహా ప్రయోగం జరగడం ఇదే ప్రథమం. ఈ అగ్ని-ప్రైమ్ క్షిపణి 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
రైల్ నెట్వర్క్పై దేశంలో ఎక్కడికైనా వేగంగా తరలించి, శత్రువుల కంటపడకుండా చాలా తక్కువ సమయంలో ప్రయోగించే సౌలభ్యం ఈ రైల్ మొబైల్ లాంచర్ ప్రత్యేకత. ఈ విజయవంతమైన ప్రయోగంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీఓ, ఎస్ఎఫ్సీ, సాయుధ బలగాలను ఆయన అభినందించారు. రైల్ నెట్వర్క్ నుంచి క్షిపణిని ప్రయోగించే వ్యవస్థను అభివృద్ధి చేసిన కొద్ది దేశాల సరసన భారత్ నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రోడ్ మొబైల్ అగ్ని-పి క్షిపణి సైన్యంలో సేవలందిస్తుండగా, ఈ కొత్త సామర్థ్యం దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది.