బండి భగీరథ్ స్వయంగా లొంగిపోయాడు: న్యాయవాది స్పష్టీకరణ
- బండి భగీరథ్ స్వయంగా లొంగిపోయాడు, అరెస్ట్ చేయలేదన్న న్యాయవాది
- టెక్ పార్క్ వద్ద భగీరథ్ను అరెస్ట్ చేశామన్న సైబరాబాద్ పోలీసులు
- భగీరథ్కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్
- పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి కుమారుడు
- అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరణ
అయితే, సైబరాబాద్ పోలీసులు మాత్రం భగీరథ్ను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. మే 16న రాత్రి 8:15 గంటలకు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచిరేవుల టెక్ పార్క్ వద్ద పక్కా సమాచారంతో భగీరథ్ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణలో నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని, అనంతరం ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించారని తమ ప్రకటనలో పేర్కొన్నారు.
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో మే 8న భగీరథ్పై పెట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు పోక్సో చట్టం కింద సెక్షన్లను చేర్చారు. ఈ కేసులో అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. తన కుమారుడు అరెస్ట్ కాలేదని, న్యాయవాదుల సమక్షంలో విచారణకు హాజరయ్యాడని బండి సంజయ్ సైతం శనివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.