దుబాయ్-కడప ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తున్నారా? ఇది మీకోసమే!
- దుబాయ్-కడప విమాన సర్వీసుపై వదంతులు
- ప్రచారంలో నిజం లేదన్న కడప ఎయిర్పోర్ట్ డైరెక్టర్
- టికెట్ల పేరుతో మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరిక
- సమాచారం కోసం అధికారులను సంప్రదించాలని సూచన
ఈ నెల 23 నుంచి దుబాయ్-కడప మధ్య ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కడప విమానాశ్రయ డైరెక్టర్ సుజిత్ కుమార్ పొద్దార్ స్పష్టం చేశారు. ఈ మేరకు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలు వీటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
దుబాయ్-కడప మధ్య విమాన సర్వీసులకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని డైరెక్టర్ తెలిపారు. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ట్రావెల్ ఏజెంట్లు టికెట్ల పేరుతో ప్రజలను మోసం చేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రయాణికులు అనధికారిక వార్తలను నమ్మి టికెట్లు బుక్ చేసుకోవద్దని ఈ సందర్భంగా సూచించారు.
భవిష్యత్తులో ఏవైనా అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించాల్సి వస్తే, విమానాశ్రయ అధికారులు అధికారికంగా ప్రకటిస్తారని ఆయన వివరించారు. విమాన సర్వీసులపై ఎటువంటి సందేహాలున్నా సోషల్ మీడియా పోస్టులపై ఆధారపడకుండా, నేరుగా విమానాశ్రయ అధికారులను లేదా సిబ్బందిని సంప్రదించాలని కోరారు.
దుబాయ్-కడప మధ్య విమాన సర్వీసులకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని డైరెక్టర్ తెలిపారు. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ట్రావెల్ ఏజెంట్లు టికెట్ల పేరుతో ప్రజలను మోసం చేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రయాణికులు అనధికారిక వార్తలను నమ్మి టికెట్లు బుక్ చేసుకోవద్దని ఈ సందర్భంగా సూచించారు.
భవిష్యత్తులో ఏవైనా అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించాల్సి వస్తే, విమానాశ్రయ అధికారులు అధికారికంగా ప్రకటిస్తారని ఆయన వివరించారు. విమాన సర్వీసులపై ఎటువంటి సందేహాలున్నా సోషల్ మీడియా పోస్టులపై ఆధారపడకుండా, నేరుగా విమానాశ్రయ అధికారులను లేదా సిబ్బందిని సంప్రదించాలని కోరారు.