యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్.. శాంసంగ్ సెటైర్లు
- యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయో ఆవిష్కరణ
- లాంచ్పై శాంసంగ్ వరుస సెటైరికల్ పోస్టులు
- “మా మిగిలిపోయిన టెక్నాలజీ..” అంటూ వ్యంగ్యం
- ట్రై-ఫోల్డ్ ఫోన్లను ప్రస్తావించిన శాంసంగ్
- శాంసంగ్ తొలి గెలాక్సీ ఫోల్డ్ 2019లో విడుదల
ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి యాపిల్ ఎట్టకేలకు అడుగుపెట్టింది. తొలి ఫోల్డబుల్ ‘ఐఫోన్ డ్యుయో’ను బుధవారం ఆవిష్కరించింది. అయితే యాపిల్ ప్రత్యర్థి శాంసంగ్ మాత్రం దీన్ని స్వాగతించకుండా సెటైర్లతో స్పందించింది. ఫోల్డబుల్ ఫోన్ల విషయంలో యాపిల్ చాలా ఆలస్యంగా వచ్చిందంటూ తన అమెరికా సోషల్ మీడియా ఖాతాల్లో వరుస పోస్టులు చేసింది.
‘మా పాత టెక్నాలజీనే మళ్లీ చూపిస్తున్నారు’
యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ను ఆవిష్కరించిన వెంటనే శాంసంగ్ ఎక్స్లో సెటైర్లకు దిగింది. “మా పాత టెక్నాలజీని బాగు చేసి వాడుకుంటున్నారా? అది పూర్తయ్యాక మాకు చెప్పండి” అంటూ వ్యంగ్యంగా పోస్టు చేసింది. మరో పోస్టులో “ఇదంతా ఎక్కడో చూసినట్టుగానే ఉంది. పాత వెర్షన్కు కొత్త సీక్వెలా?” అని ఎద్దేవా చేసింది. ఇంకో పోస్టులో “మమ్మల్ని ఇంతకాలం వేచి ఉండమన్నారు కదా.. పర్లేదు. మేం ఇప్పటికే మూడు మడతల ఫోన్లతో ముందుకెళ్లిపోయాం” అంటూ ట్రై-ఫోల్డ్ ఫోన్లను ప్రస్తావించింది. “ఇప్పటివరకైతే కొత్తదేమీ కనిపించడం లేదు” అంటూ మరో పోస్టుతో యాపిల్ను టార్గెట్ చేసింది.
ఫోల్డబుల్ మార్కెట్లో ఏడేళ్ల ముందంజ
శాంసంగ్ ఈ స్థాయిలో స్పందించడానికి ప్రధాన కారణం ఫోల్డబుల్ ఫోన్ విభాగంలో దాని ముందంజే. 2019లోనే తొలి గెలాక్సీ ఫోల్డ్ను ఆ సంస్థ విడుదల చేసింది. అప్పటి నుంచి శాంసంగ్తో పాటు గూగుల్, మోటరోలా వంటి కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్లను తీసుకొచ్చాయి. డిస్ప్లే మడత గుర్తు, బలహీనమైన హింజ్లు, ఫోన్ బరువు వంటి సమస్యలను కూడా క్రమంగా మెరుగుపరిచాయి. దీంతో యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ తీసుకొచ్చే సమయానికి ప్రత్యర్థి సంస్థలు ఇప్పటికే తదుపరి దశ డిజైన్లపై ప్రయోగాలు చేస్తున్నాయని శాంసంగ్ తన సెటైర్లతో చెప్పే ప్రయత్నం చేసింది.
టెక్ దిగ్గజాలు యాపిల్, శాంసంగ్ మధ్య చాలాకాలంగా టెక్నాలజీ, డిజైన్లకు సంబంధించి అంతర్జాతీయ పేటెంట్ వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శాంసంగ్ సెటైర్లు విసరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
‘మా పాత టెక్నాలజీనే మళ్లీ చూపిస్తున్నారు’
యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ను ఆవిష్కరించిన వెంటనే శాంసంగ్ ఎక్స్లో సెటైర్లకు దిగింది. “మా పాత టెక్నాలజీని బాగు చేసి వాడుకుంటున్నారా? అది పూర్తయ్యాక మాకు చెప్పండి” అంటూ వ్యంగ్యంగా పోస్టు చేసింది. మరో పోస్టులో “ఇదంతా ఎక్కడో చూసినట్టుగానే ఉంది. పాత వెర్షన్కు కొత్త సీక్వెలా?” అని ఎద్దేవా చేసింది. ఇంకో పోస్టులో “మమ్మల్ని ఇంతకాలం వేచి ఉండమన్నారు కదా.. పర్లేదు. మేం ఇప్పటికే మూడు మడతల ఫోన్లతో ముందుకెళ్లిపోయాం” అంటూ ట్రై-ఫోల్డ్ ఫోన్లను ప్రస్తావించింది. “ఇప్పటివరకైతే కొత్తదేమీ కనిపించడం లేదు” అంటూ మరో పోస్టుతో యాపిల్ను టార్గెట్ చేసింది.
ఫోల్డబుల్ మార్కెట్లో ఏడేళ్ల ముందంజ
శాంసంగ్ ఈ స్థాయిలో స్పందించడానికి ప్రధాన కారణం ఫోల్డబుల్ ఫోన్ విభాగంలో దాని ముందంజే. 2019లోనే తొలి గెలాక్సీ ఫోల్డ్ను ఆ సంస్థ విడుదల చేసింది. అప్పటి నుంచి శాంసంగ్తో పాటు గూగుల్, మోటరోలా వంటి కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్లను తీసుకొచ్చాయి. డిస్ప్లే మడత గుర్తు, బలహీనమైన హింజ్లు, ఫోన్ బరువు వంటి సమస్యలను కూడా క్రమంగా మెరుగుపరిచాయి. దీంతో యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ తీసుకొచ్చే సమయానికి ప్రత్యర్థి సంస్థలు ఇప్పటికే తదుపరి దశ డిజైన్లపై ప్రయోగాలు చేస్తున్నాయని శాంసంగ్ తన సెటైర్లతో చెప్పే ప్రయత్నం చేసింది.
టెక్ దిగ్గజాలు యాపిల్, శాంసంగ్ మధ్య చాలాకాలంగా టెక్నాలజీ, డిజైన్లకు సంబంధించి అంతర్జాతీయ పేటెంట్ వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శాంసంగ్ సెటైర్లు విసరడం ప్రాధాన్యత సంతరించుకుంది.