ఆసియా కప్ ట్రోఫీ వద్దు.. భారత్‌ను ఓడించాలన్న పాక్ అభిమాని.. టీమిండియా ఫ్యాన్స్ కౌంటర్

ఆసియా కప్ ట్రోఫీ వద్దు.. భారత్‌ను ఓడించాలన్న పాక్ అభిమాని.. టీమిండియా ఫ్యాన్స్ కౌంటర్

Pakistan fan wants to beat India instead of winning Asia Cup as Indian fans react
  • సోషల్ మీడియాలో పాక్ ఫ్యాన్ వీడియో వైరల్
  • కౌంటర్లు ఇస్తున్న టీమిండియా ఫ్యాన్స్
  • మహిళల ఆసియా కప్‌లో సెమీస్‌కు చేరిన భారత్, పాకిస్థాన్
  • సెమీస్‌లో గెలిస్తే ఫైనల్లో మరోసారి దాయాదుల పోరుకు అవకాశం
మహిళల ఆసియా కప్ 2026 టోర్నీ సందర్భంగా పాకిస్థాన్‌కు చెందిన ఓ అభిమాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. దీనిపై భారత క్రికెట్ అభిమానులు తమదైన శైలిలో ధీటుగా బదులిస్తున్నారు.

దుబాయ్ వేదికగా హాంగ్‌కాంగ్‌తో జరిగిన ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన పాకిస్థాన్ మహిళల జట్టు సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం పాక్ జట్టు హెడ్ కోచ్ వహాబ్ రియాజ్‌తో ఓ అభిమాని మాట్లాడుతూ, "మాకు ఆసియా కప్ ట్రోఫీ అవసరం లేదు, భారత జట్టును ఓడిస్తే చాలు" అని కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు. "వారు క్రికెట్‌ను యుద్ధంలా, యుద్ధాన్ని ఆటలా పరిగణిస్తారు. కానీ రెండు చోట్లా వారికి ఓటమి తప్పదు" అని ఒకరు వ్యాఖ్యానించగా, "మొన్నటి ఓటమి షాక్ ఇంకా సరిపోలేదా? ఫైనల్‌కు రండి, ఈసారి టీమిండియా అంతకంటే గట్టిగా బుద్ధి చెబుతుంది" అంటూ మరొక అభిమాని ఎద్దేవా చేశాడు.

ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ జట్లూ సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. సెప్టెంబర్ 10న జరగనున్న సెమీస్‌లో బంగ్లాదేశ్ లేదా యూఏఈ విజేతతో భారత్ తలపడనుంది. మరో సెమీ ఫైనల్‌లో పాకిస్థాన్ జట్టు శ్రీలంకను ఢీకొట్టనుంది. ఈ రెండు మ్యాచుల్లోనూ భారత్, పాకిస్థాన్ విజయం సాధిస్తే, సెప్టెంబర్ 13న జరిగే ఫైనల్‌లో దాయాదుల మధ్య మరో హై వోల్టేజ్ పోరు ఖాయం కానుంది.
Advertisement
Pakistan Women Cricket Team
India vs Pakistan Women
Womens Asia Cup 2026
Wahab Riaz

More Telugu News