కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది తమిళ ఇంజనీరింగ్ విద్యార్థుల దుర్మరణం
- కేరళలోని త్రిస్సూర్లో ఘటన
- ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
- హైవేపై లారీని అక్రమంగా పార్క్ చేయడమే కారణమని అనుమానం
- గురువాయూర్ నుంచి కొడుంగల్లూర్ వెళ్తుండగా ఘటన
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. త్రిస్సూర్ జిల్లాలో ఆగి ఉన్న లారీని ఓ కారు వేగంగా ఢీకొట్టిన ఘటనలో 8 మంది యువకులు దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మృతులను తమిళనాడుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులుగా అనుమానిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం రాత్రి 11:40 గంటల సమయంలో త్రిస్సూర్ జిల్లాలోని కైపమంగలం సమీపంలోని పనంబిక్కున్ను వద్ద జాతీయ రహదారి 66పై ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడు రిజిస్ట్రేషన్ (TN 59 DW 8299) ఉన్న కారులో 8 మంది యువకులు గురువాయూర్ నుంచి కొడుంగల్లూర్ వైపు ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో, నిర్మాణ పనులు జరుగుతున్న హైవేపై రోడ్డు పక్కన ఆగి ఉన్న గూడ్స్ లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టింది.
ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయి లారీ కిందకు చొచ్చుకుపోయింది. దీంతో కారులోని వారంతా అందులోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారును కట్టర్లతో కత్తిరించి లోపల ఉన్న వారిని బయటకు తీశారు. అప్పటికే ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
మృతులంతా తమిళనాడులోని దిండిగల్లో ఉన్న పీఎస్ఎన్ఏ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులుగా ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాద స్థలంలో లభించిన ఓ విద్యార్థి ఐడీ కార్డు ఆధారంగా పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం త్రిస్సూర్ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న హైవేపై లారీని అక్రమంగా పార్క్ చేయడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం రాత్రి 11:40 గంటల సమయంలో త్రిస్సూర్ జిల్లాలోని కైపమంగలం సమీపంలోని పనంబిక్కున్ను వద్ద జాతీయ రహదారి 66పై ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడు రిజిస్ట్రేషన్ (TN 59 DW 8299) ఉన్న కారులో 8 మంది యువకులు గురువాయూర్ నుంచి కొడుంగల్లూర్ వైపు ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో, నిర్మాణ పనులు జరుగుతున్న హైవేపై రోడ్డు పక్కన ఆగి ఉన్న గూడ్స్ లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టింది.
ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయి లారీ కిందకు చొచ్చుకుపోయింది. దీంతో కారులోని వారంతా అందులోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారును కట్టర్లతో కత్తిరించి లోపల ఉన్న వారిని బయటకు తీశారు. అప్పటికే ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
మృతులంతా తమిళనాడులోని దిండిగల్లో ఉన్న పీఎస్ఎన్ఏ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులుగా ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాద స్థలంలో లభించిన ఓ విద్యార్థి ఐడీ కార్డు ఆధారంగా పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం త్రిస్సూర్ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న హైవేపై లారీని అక్రమంగా పార్క్ చేయడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.