హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిమ్మగడ్డపై సెటైర్ వేసిన విజయసాయిరెడ్డి
- స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను సస్పెండ్ చేసిన కోర్టు
- నిమ్మగడ్డ గారూ సుప్రీంకు వెళతారా అంటూ విజయసాయి వ్యంగ్యం
- లేక,చంద్రబాబు ఇంటికి వెళతారా అంటూ వ్యాఖ్యలు
- దయచేసి చెప్పండి అంటూ ట్వీట్
అంతకుముందు విజయసాయి.... టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. మహాభారతంలో సైంధవుని పాత్రే ఇప్పటి ఆంధ్ర రాజకీయాల్లో చంద్రబాబు పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. సైంధవుడు అన్నింటికీ అడ్డం పడతాడని, అయితే అది తాత్కాలికమేనని తెలిపారు. ఎందరు సైంధవులు వచ్చినా సంక్షేమ మహాయజ్ఞం ఆగదని స్పష్టం చేశారు. సైంధవ సంహారం కోసం అర్జునుడు పాశుపతాస్త్రం ప్రయోగించాడని, చంద్రబాబుపై జనం ప్రజాస్వామ్య అస్త్ర ప్రయోగం తప్పదని హెచ్చరించారు.