ఏపీలో కమ్మ కులస్తులంతా అంటరానివారు అయిపోయారు: పోసాని
- దీనికి కారణం చంద్రబాబు, టీడీపీనే
- కమ్మవారంతా ఓటు వేస్తే ఎన్నికల్లో గెలుస్తారా?
- పార్టీని గెలిపించేంత కమ్మ జనాభా రాష్ట్రంలో ఉందా?
కాపులకు ఓటు వేయకూడదు, రెడ్లకు ఓటు వేయకూడదు, కమ్మవారంతా కమ్మవారికే ఓటు వేయాలనే భావనను తీసుకొస్తున్నారని పోసాని విమర్శించారు. కమ్మవారంతా ఓటు వేసినంత మాత్రాన చంద్రబాబు గెలుస్తారా? అని ప్రశ్నించారు. ఒంటరిగా పార్టీని గెలిపించేంత కమ్మ జనాభా రాష్ట్రంలో ఉందా? అని అన్నారు. కులం పేరుతో తిరిగేవాడు గాడిద అని విమర్శించారు. తాను కూడా కమ్మవాడినేనని... కమ్మ అని గర్వంగా చెప్పుకుంటానని అన్నారు. కమ్మ అనేది ఒక గుర్తింపు మాత్రమేనని చెప్పారు. ఇతర కులాల పట్ల సహనం, పరమత సహనం ఉండాలని పోసాని చెప్పారు.