మేఘా ఆకాశ్ కి కూడా ఛాన్సులు తన్నుకొస్తున్నాయ్!
దర్శకుడు మారుతి .. చైతూ కథానాయకుడిగా ఒక సినిమాను తెరకెక్కించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే ను తీసుకోవాలని అనుకున్నాడు. అయితే చైతూతో తాను చేయనున్న సినిమా కోసం అప్పటికే ఆమెను చందూ మొండేటి సంప్రదించాడట. దాంతో ఒకరిద్దరు పేర్లను పరిశీలించిన మారుతి, చివరికి మేఘా ఆకాశ్ ను కథానాయికగా ఎంచుకున్నాడట. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.