కాలేజ్ స్టూడెంట్స్ పై దృష్టి పెట్టిన హీరోలు!
'కేశవ' సినిమా సమయంలో నిఖిల్ .. 'నేనే రాజు నేనే మంత్రి' విడుదల సమయంలో రానా .. 'అర్జున్ రెడ్డి' సమయంలో విజయ్ దేవరకొండ ఆయా ప్రాంతాల్లోని కాలేజ్ లను ఎంచుకుని అక్కడ సందడి చేశారు. ఆ సినిమాలన్నీ కూడా హిట్ కావడంతో .. చైతూ కూడా అదే పని చేశాడు. ఈ నెల 8వ తేదీ 'యుద్ధం శరణం' రిలీజ్ ఉండటంతో, వైజాగ్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ కి వెళ్లాడు. అక్కడి స్టూడెంట్స్ తో ఈ సినిమా విశేషాలను పంచుకున్నాడు .. వాళ్లతో కలిసి సందడి చేశాడు .. సెల్ఫీలు దిగాడు.