అమ్మాయి పుడితే లక్ష రూపాయిలు... పుదుచ్చేరి సీఎం ఎన్నికల హామీ
- మళ్లీ అధికారంలోకి వస్తే ఈ పథకం అమలు చేస్తామని హామీ
- ప్రస్తుతం అందిస్తున్న రూ.50 వేల సాయాన్ని రెట్టింపు చేయనున్నట్టు ప్రకటన
- మత్స్యకారులను అత్యంత వెనుకబడిన తరగతుల్లో చేర్చేందుకు చర్యలు
- కేంద్రం సహకారంతో రూ.3 వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడి
ప్రస్తుతం తమ ప్రభుత్వం ఆడబిడ్డ పుట్టిన వెంటనే రూ.50 వేలు డిపాజిట్ చేస్తోందని, మళ్లీ అవకాశం ఇస్తే ఆ మొత్తాన్ని రూ.లక్షకు పెంచుతామని రంగసామి స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా బాలికల భవిష్యత్తుకు, ఉన్నత విద్యకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మరికొన్ని హామీలు కూడా ఇచ్చారు. మత్స్యకారుల చిరకాల డిమాండ్ అయిన అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) జాబితాలో చేర్చడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే, పుదుచ్చేరిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ) ద్వారా రూ.3వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని, రానున్న ఎన్నికల్లో గెలిస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.