కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి, పాయల్ శంకర్.. ఒకే టేబుల్పై భోజనం, రెండు గంటలకు పైగా సమాలోచనలు
- అసెంబ్లీలోని మెంబర్స్ లాంజ్లో ఆసక్తికర సన్నివేశం
- లాంజ్లో ఒకే టేబుల్పై కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యేలు
- కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంభాషణ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, బీజేపీ శాసనసభ్యుడు పాయల్ శంకర్ ఒకే టేబుల్పై భోజనం చేశారు. ఆ తర్వాత అక్కడే చాలాసేపు వారు మాట్లాడుకున్నారు. రెండు గంటలకు పైగా వారి మధ్య సంభాషణలు జరగడం గమనార్హం. మూడు పార్టీలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి సుదీర్ఘంగా మాట్లాడుకోవడం ఆసక్తిగా మారింది.