జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణస్వీకారం చేస్తారు: బొత్స సత్యనారాయణ
- టీడీపీ హింసకు పాల్పడుతోందన్న బొత్స
- అధికారుల మార్పిడి జరిగిన ప్రాంతాల్లోనే అల్లర్లు జరిగాయని విమర్శ
- వైసీపీ 175కి దగ్గరగా సీట్లను గెలవబోతోందని ధీమా
ఎన్నికల కమిషన్ నియమించిన ఒక రిటైర్డ్ అధికారి ఏకపక్ష నిర్ణయాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని బొత్స చెప్పారు. ఎక్కడైతే అధికారుల మార్పిడి జరిగిందో అక్కడే అల్లర్లు జరిగాయని తెలిపారు. పోలీసులు న్యాయంగా వ్యవహరించాలని సూచించారు.
వైసీపీ 175 సీట్లకు దగ్గరగా గెలవబోతోందని బొత్స ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న విశాఖలో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. విశాఖ కేంద్రంగా జగన్ పాలన ప్రారంభమవుతుందని చెప్పారు. విశాఖలో ప్రశాంతతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం రావాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా తమ పార్టీ సీట్లు అవసరం ఉండేలా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలని ఆశిస్తున్నానని తెలిపారు.