Pavitra Lokesh: మీడియాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పవిత్రా లోకేశ్

Pavitra Lokesh complains against media

  • మీడియాలో నరేశ్, పవిత్రా లోకేశ్ లపై కథనాలు
  • ఓ హోటల్ గదిలో ఇరువురు... దాడికి యత్నించిన రమ్య
  • మీడియాలో ప్రముఖంగా ప్రసారం
  • రిపోర్టర్లు తనను వెంబడిస్తున్నారన్న పవిత్ర
  • కేసు నమోదు చేసుకున్న మైసూరు పోలీసులు

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, క్యారెక్టర్ నటి పవిత్రా లోకేశ్ పై గత కొన్నిరోజులుగా మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరూ మైసూరులో ఓ హోటల్ గదిలో ఉండగా, పవిత్ర లోకేశ్ ను నరేశ్ భార్య రమ్య చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించడం తెలిసిందే. ఇది కూడా మీడియాలో ప్రముఖంగా ప్రసారమైంది. 

ఈ నేపథ్యంలో, పవిత్ర లోకేశ్ పోలీసులను ఆశ్రయించారు. తన పరువుప్రతిష్ఠలకు భంగం కలిగేలా మీడియాలో కథనాలు వస్తున్నాయని, కొందరు మీడియా ప్రతినిధులు తనను వెంబడిస్తున్నారంటూ మైసూరు వీవీపురం పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Pavitra Lokesh
Complaint
Media
Police
Naresh
Ramya
Bengaluru
Tollywood
  • Loading...

More Telugu News