టీమిండియా భవిష్యత్ కోసం పాటుపడతా: వీవీఎస్ లక్ష్మణ్
- ఎన్సీఏ కొత్త చీఫ్గా వీవీఎస్ లక్ష్మణ్
- నిన్న బాధ్యతల స్వీకరణ
- కొత్త సవాళ్ల కోసం తాను ఎదురుచూస్తున్నానని వ్యాఖ్య
కాగా, ఎన్సీఏ చీఫ్గా కొనసాగిన రాహుల్ ద్రవిడ్ టీమిండియా కోచ్గా మారిన నేపథ్యంలో ఎన్సీఏ బాధ్యతలు లక్ష్మణ్కు దక్కాయి. ఆయన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. గతంలో ఆ బాధ్యతల్లో ఉన్న రాహుల్ ద్రవిడ్ చాలా మంది యువ ఆటగాళ్లను మంచి క్రికెటర్లుగా తీర్చిదిద్దాడు.
అంతకుముందు రాహుల్ ద్రవిడ్ అండర్-19తో పాటు ఇండియా-ఏ జట్లకు కూడా కోచ్గా ఉన్నారు. ఇప్పుడు జాతీయ క్రికెట్ అకాడమీ భారం అంతా లక్ష్మణ్పై పడింది. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ కుటుంబం సహా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లి అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది.