అమ్మవారికి బంగారు బోనమెత్తి 'తెలంగాణ' మొక్కు తీర్చుకున్న విజయశాంతి
- ఏడేళ్ల కింద విజయశాంతి మొక్కు
- ప్రత్యేక తెలంగాణ వస్తే బంగారు బోనం
- మాట నిలుపుకున్న విజయశాంతి
- ఈసారి బీజేపీని గెలిపించాలని ప్రార్థన
- మరోసారి బంగారు బోనమెత్తుతానని మొక్కు
ఇక, వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి, అధికారంలోకి తీసుకురావాలని అమ్మవారిని ప్రార్థించానని, బీజేపీ గెలిస్తే మరోసారి బంగారు బోనమెత్తుతానని అమ్మవారికి మొక్కుకున్నానని విజయశాంతి వెల్లడించారు. నియంతృత్వంలో అల్లాడిపోతున్న తెలంగాణలో ప్రజాపాలన బీజేపీతోనే సాధ్యమని ఆమె ఉద్ఘాటించారు. కరోనా బారి నుంచి ప్రజలను కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. అమ్మవారి శక్తిపై తనకు నమ్మకం ఉందని అన్నారు. కాగా, విజయశాంతి వెంట బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, ఇతర నేతలు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.