'లైగర్' అంతకు మించి ఉంటుందన్న విజయ్ దేవరకొండ!
- 'లైగర్' గా విజయ్ దేవరకొండ
- కథానాయికగా అనన్య పాండే
- ఓటీటీ రిలీజ్ అంటూ ప్రచారం
- కొట్టిపారేసిన విజయ్ దేవరకొండ
'లైగర్'ను అన్ని భాషల్లోను నేరుగా ఓటీటీ రిలీజ్ కి ఇవ్వమంటూ 200 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందనే టాక్ జోరుగా షికారు చేస్తోంది. ఈ ప్రచారంపై తాజాగా విజయ్ దేవరకొండ స్పందించాడు. "ఇది చాలా తక్కువ .. ఇంతకు మించి థియేటర్లలో చూపిస్తాను" అని చెప్పాడు. అంటే 'లైగర్'కి 200 కోట్ల రూపాయల ఆఫర్ చాలా చిన్నదనీ, థియేటర్స్ లో ఈ సినిమా ఇంతకు మించిన వసూళ్లను రాబడుతుందనే విషయాన్ని ఆయన స్పష్టం చేశాడు. ఈ సినిమా థియేటర్లలో మాత్రమే విడుదలవుతుందని చెప్పకనే చెప్పాడు. ఈ సినిమా ద్వారా కథానాయికగా 'అనన్య పాండే' పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.