బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఉత్కంఠ.. మంత్రి సోదరుడిపై రాంరెడ్డి విజయం
- తెలంగాణ బార్ కౌన్సిల్ నూతన చైర్మన్గా సాముల రాంరెడ్డి ఎన్నిక
- మంత్రి పొన్నం సోదరుడిపై ఒక్క ఓటు తేడాతో ఉత్కంఠ విజయం
- వైస్ చైర్మన్గా చలకాని వెంకట్ యాదవ్ గెలుపు
- బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా జి. కిరణ్ కుమార్
- ఓటు హక్కు వినియోగించుకున్న 26 మంది బార్ కౌన్సిల్ సభ్యులు
తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ నూతన చైర్మన్గా సాముల రాంరెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం హైకోర్టు ప్రాంగణంలోని బార్ కౌన్సిల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగింది. చైర్మన్ పదవికి జరిగిన పోటీలో సాముల రాంరెడ్డికి 12 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి, మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడు పొన్నం అశోక్ గౌడ్కు 11 ఓట్లు లభించాయి. దీంతో కేవలం ఒక ఓటు స్వల్ప తేడాతో రాంరెడ్డి విజయం సాధించారు. ఇదే పదవికి పోటీ చేసిన టి.హనుమంత్ రెడ్డికి 3 ఓట్లు దక్కాయి.
వైస్ చైర్మన్గా చలకాని వెంకట్ యాదవ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) సభ్యుడిగా జి.కిరణ్ కుమార్ గెలుపొందారు. వైస్ చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికలో వెంకట్ యాదవ్కు 13 ఓట్లు రాగా, జాకీర్ హుస్సేన్ జావిద్కు 10, గోకుల్ రామారావుకు 3 ఓట్లు వచ్చాయి. ఇక బీసీఐ సభ్యుడి పదవికి జరిగిన పోటీలో జి.కిరణ్ కుమార్ 10 ఓట్లతో విజయం సాధించారు.
రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల ద్వారా ఎన్నికైన 26 మంది బార్ కౌన్సిల్ సభ్యులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో నూతన కార్యవర్గం కొలువుదీరింది.
వైస్ చైర్మన్గా చలకాని వెంకట్ యాదవ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) సభ్యుడిగా జి.కిరణ్ కుమార్ గెలుపొందారు. వైస్ చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికలో వెంకట్ యాదవ్కు 13 ఓట్లు రాగా, జాకీర్ హుస్సేన్ జావిద్కు 10, గోకుల్ రామారావుకు 3 ఓట్లు వచ్చాయి. ఇక బీసీఐ సభ్యుడి పదవికి జరిగిన పోటీలో జి.కిరణ్ కుమార్ 10 ఓట్లతో విజయం సాధించారు.
రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల ద్వారా ఎన్నికైన 26 మంది బార్ కౌన్సిల్ సభ్యులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో నూతన కార్యవర్గం కొలువుదీరింది.