Advertisement

చేపలవేట దుర్ఘటన.. మృతుల కుటుంబ సభ్యులతో నారా లోకేశ్ ఆత్మీయ సమావేశం

Nara Lokesh meets family members of Godavari drowning victims
  • గోదావరి నదిలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించిన మంత్రి లోకేశ్
  • బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ
  • సీఎం చంద్రబాబుతో కలిసి రంపచోడవరంలో పర్యటించిన లోకేశ్
  • మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లోనూ పాల్గొన్న సీఎం, మంత్రి
పోలవరం జిల్లాలో ఇటీవల గోదావరి నదిలో చేపలవేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. రంపచోడవరంలో పర్యటించిన ఆయన, బాధితులను కలిసి ధైర్యం చెప్పారు. వారికి ప్రభుత్వం, పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. "పోలవరం జిల్లా గొల్లగూడెం వద్ద గోదావరిలో చేపలవేటకు వెళ్లి ఇటీవల ప్రాణాలు కోల్పోయిన ఊకె సుశీల, తుర్రం భారతి, బాసిబోయిన బాలరాజు, ఊకె రమేశ్ కుటుంబ సభ్యులను రంపచోడవరంలో కలిశాను. బాధిత కుటుంబ సభ్యులకు ఏ కష్టమొచ్చినా తాను అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చాను" అని తెలిపారు.

కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి మంత్రి లోకేశ్ శుక్రవారం రంపచోడవరంలో జరిగిన 'మెగా పేరెంట్-టీచర్ మీటింగ్'లో పాల్గొన్నారు. ఈ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకే ఆయన జిల్లాకు విచ్చేశారు. ఈ పర్యటనలోనే ఆయన ఇటీవల జరిగిన దుర్ఘటన బాధితులను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కొద్ది రోజుల క్రితం ఏటపాక మండలం గొల్లగూడెం సమీపంలో గోదావరి నదిలో చేపలవేటకు వెళ్లిన ఐదుగురు గిరిజనులు నీట మునిగి మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ వారి కుటుంబాలను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు.
Advertisement
Nara Lokesh
Rampachodavaram
Godavari drowning accident
Polavaram fishermen families
Andhra Pradesh Minister
Gollagudem tribal deaths

More Telugu News