మరోసారి గొడవ చేస్తే తీవ్ర చర్యలు: మంచు సోదరులకు సీపీ హెచ్చరిక
- తారస్థాయికి మంచు కుటుంబం గొడవలు
- ఈ నేపథ్యంలో బుధవారం సీపీ సుధీర్ బాబు ఎదుట విచారణకు మంచు సోదరులు
- కుటుంబ సమస్యను శాంతి భద్రతల సమస్యగా మార్చొద్దని సీపీ వార్నింగ్
- శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తానని రూ.1లక్ష పూచీకత్తు సమర్పించిన మనోజ్
మొదట మంచు మనోజ్ వాంగ్మూలం తీసుకున్నారు. సీపీ ఆదేశాల మేరకు మంచు మనోజ్ ఏడాదిపాటు ప్రతికూల చర్యలకు దిగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తానని రూ.1లక్ష పూచీకత్తు సమర్పించారు. ఆ తర్వాత బుధవారం సాయంత్రం మంచు విష్ణు కమిషనర్ ముందు హాజరయ్యారు. ఎలాంటి సమస్యలు సృష్టించొద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని సీపీ సుధీర్ బాబు ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యల గురించి తెలియజేస్తామన్నారు.