ఎస్ఎల్బీసీ టన్నెల్ లో మరో మృతదేహం గుర్తింపు
- ఒక కాలు కనిపించడం, దుర్వాసన రావడంతో తవ్వకాలు
- ఇప్పటి వరకు రెండు మృతదేహాలు లభ్యం
- మరో ఆరు మృతదేహాల కోసం కొనసాగుతున్న గాలింపు
టన్నెల్ ప్రమాదంలో ఎనిమిది మంది సజీవసమాధి అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రెండు మృతదేహాలను గుర్తించారు. మరో ఆరుగురి మృతదేహాల కోసం గాలింపు జరుగుతోంది.
మరోవైపు, టన్నెల్ లో ఇకపై డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుతం సహాయక చర్యల్లో 700 మంది నిర్విరామంగా పని చేస్తున్నారు. ఇప్పుడు లభించిన మృతదేహం ఎవరిది అనేది నిర్ధారించి ప్రకటన చేయాల్సి ఉంది.