టీచర్ల ఓట్లను అభ్యర్థిస్తూ వీడియో విడుదల చేసిన నాగబాబు
- కరోనా కాలంలో టీచర్లను అవమానించిన వైసీపీకి ఓటు వేయవద్దని కోరిన జనసేన నేత
- బార్ల ముందు క్యూలైన్లు సర్దే పని అప్పగించారని ప్రస్తావించిన నాగబాబు
- పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ మెజారిటీ గెలుపులో భాగం కావాలని అభ్యర్థన
కూటమి ప్రభుత్వం టీచర్లకు గౌరవనీయమైన స్థానం, సముచితమైన స్థానం కల్పిస్తుంది. మీకు అన్ని విధాలా ఉపయోగపడే పనులతో ముందుకొస్తుంది. నీచమైన సంస్కృతి కలిగిన వైసీపీ ప్రభుత్వానికి మాత్రం ఓటు వేయకండి. గురువులను ఇంత దారుణంగా అవమానించిన విషయాన్ని మరచిపోయి వైసీపీకి ఓటు వేస్తే చాలా పెద్ద పొరపాటు అవుతుంది. అలాగే పిఠాపురంలో పవన్ కల్యాణ్ని అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రక్రియలో మీరు కూడా భాగం కావాలని కోరుతున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు చాలా మంచి జరుగుతుంది’’ అని నాగబాబు అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను జనసేన పార్టీ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసింది.