'భోళాశంకర్' చిత్రం యూనిట్ 11 డాక్యుమెంట్లు ఇవ్వలేదు: ఏపీ ప్రభుత్వం
- రేపు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న 'భోళాశంకర్'
- టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరిన చిత్ర యూనిట్
- 11 డాక్యుమెంట్లు ఇవ్వాలని నిర్మాతలకు సూచించిన ప్రభుత్వం
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం స్పందిస్తూ... అనుమతికి కావాల్సిన 11 డాక్యుమెంట్లను నిర్మాతలు ఇవ్వలేదని చెప్పింది. చిత్ర నిర్మాణ వ్యయానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని తెలిపింది. రేట్ల పెంపుకు సంబంధించి నెల ముందగానే దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. చిత్ర నిర్మాతలు గత ఏడాది ఐటీ ప్రూఫ్స్, జీఎస్టీ వివరాలు ఇవ్వలేదని తెలిపింది. మరోవైపు టికెట్ల ధరలు పెంచుకోవాలంటూ 20 శాతం షూటింగ్ ఏపీలో జరిగినట్టు ఆధారాలను ఇవ్వాలనే నిబంధనను కూడా ప్రభుత్వం పెట్టింది. పెండింగ్ డాక్యుమెంట్లను ఇవ్వాలని నిర్మాతలకు సూచించింది. అయితే చిత్ర నిర్మాతలు ఇంతవరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం అనుమతిస్తుందా? లేదా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.