Tragedy: పత్తికొండ ఎమ్మెల్యే కాన్వాయ్ లో వాహనం బోల్తా.. ఇద్దరి దుర్మరణం

Tragedy happens on Pathikonda MLA birthday

  • దైవదర్శనం కోసం కసాపురం ఆలయానికి వెళ్లిన ఎమ్మెల్యే
  • తిరిగి వచ్చేటప్పుడు బోల్తాపడిన స్కార్పియో వాహనం
  • ఘటన స్థలంలోనే ఇద్దరు వైసీపీ కార్యకర్తల దుర్మరణం

పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. జన్మదినం నాడు దైవదర్శనం చేసుకునేందుకు ఎమ్మెల్యే శ్రీదేవి కసాపురం ఆలయానికి వెళ్లి వస్తుండగా ఆమె కాన్వాయ్ లోని ఓ స్కార్పియో వాహనం బోల్తాకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు మరణించారు. వారిద్దరూ ఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో ఐదుగురు తీవ్రగాయాల పాలయ్యారు.  వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దేవనకొండ మండలం కరిడికొండ వద్ద ఓ మోటార్ సైకిల్ ను తప్పించబోయి స్కార్పియో వాహనం బోల్తాపడింది.

  • Loading...

More Telugu News