బ్రిక్స్ సదస్సు కోసం భారత్‌కు చేరుకున్న ఇరాన్ అధ్యక్షుడు

బ్రిక్స్ సదస్సు కోసం భారత్‌కు చేరుకున్న ఇరాన్ అధ్యక్షుడు

Iran President Masoud Pezeshkian arrives in India for BRICS Summit
  • మసూద్ పెజెష్కియాన్‌కు స్వాగతం పలికిన కేంద్ర సహాయ మంత్రి
  • సెప్టెంబర్ నేడు, రేపు భారత్ అధ్యక్షతన బ్రిక్స్ సమావేశాలు
  • వాణిజ్యం, చబహార్ పోర్టు వంటి అంశాలపై చర్చించే అవకాశం
  • ఇరు దేశాల మధ్య బలమైన బంధాన్ని గుర్తుచేసిన భారత విదేశాంగ శాఖ
భారత అధ్యక్షతన జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ న్యూఢిల్లీకి విచ్చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోగా, కేంద్ర సహాయ మంత్రి శంతను ఠాకూర్ సాదర స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ 'ఎక్స్' వేదికగా పెజెష్కియాన్‌కు స్వాగతం పలుకుతూ, ఇరు దేశాల మధ్య గల చారిత్రక, సాంస్కృతిక అనుబంధాన్ని గుర్తు చేసింది. బ్రిక్స్ భాగస్వాములుగా ఉమ్మడి ప్రగతి, శ్రేయస్సు కోసం కలిసి పనిచేస్తామని పేర్కొంది. సెప్టెంబర్ 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న ఈ సదస్సులో బ్రిక్స్ సభ్య దేశాలతో పాటు భాగస్వామ్య, ఆహ్వానిత దేశాల అధినేతలు పాల్గొననున్నారు.

భారత్, ఇరాన్ మధ్య సుదీర్ఘ చారిత్రక సంబంధాలు ఉన్నాయని, ఈ సదస్సును తమ దేశ ప్రయోజనాలకు అనుకూలంగా మలుచుకుంటామని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకాయి స్పష్టం చేశారు. ముఖ్యంగా వాణిజ్యం, ఆర్థిక సహకారం, చబహార్ పోర్టు అభివృద్ధి వంటి కీలక అంశాలపై ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

గత నెలలో కిర్గిజ్‌స్థాన్‌లోని బిష్కెక్‌లో జరిగిన ఎస్‌సీవో సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పెజెష్కియాన్ సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా పరిణామాలపై కూడా వారు చర్చించారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలన్నది భారత్ విధానమని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 
Advertisement
Masoud Pezeshkian
BRICS Summit India
India Iran Relations
Chabahar Port Development
New Delhi BRICS Summit
Narendra Modi Masoud Pezeshkian Meeting

More Telugu News