ఆటల్లో జోక్యం చేసుకుంటున్నారా? పిల్లల ఎదుగుదలను మీరు అడ్డుకుంటున్నట్టే!
- పిల్లలు స్వేచ్ఛగా ఆడుకునే అలవాటు తగ్గుతోంది
- పెద్దల జోక్యంతో దెబ్బతింటున్న ఊహాశక్తి
- ఆటలతో సమస్యల పరిష్కార నైపుణ్యం
- భాషా, సామాజిక నైపుణ్యాల్లోనూ మెరుగుదల
- పిల్లల ఆటల్లో పెద్దలు జోక్యం చేసుకోవద్దని నిపుణుల సూచన
పిల్లలు ఆడుకుంటుంటే పెద్దలు మధ్యలో జోక్యం చేసుకోవడం చాలా ఇళ్లలో కనిపించే దృశ్యమే. ‘‘అలా కాదు.. ఇలా ఆడు’’, ‘‘అది తప్పు.. ఇలా చేయి’’ అంటూ సూచనలు ఇవ్వడం ప్రేమతో చేసే పనిలా అనిపించొచ్చు. కానీ అదే పిల్లల ఊహాశక్తి, సమస్యలు పరిష్కరించే సామర్థ్యం, ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు. పిల్లలను వారి ఇష్టానుసారం ఆడనివ్వడం కూడా వారి ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి.
చిన్న సంఘటన.. పెద్ద సందేశం
సైకాలజిస్ట్ పీటర్ గ్రే చెప్పిన ఓ సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇద్దరు ఆరేళ్ల చిన్నారులు చెక్క పలకలను వంతెనగా ఊహించుకుని, మొసళ్లతో నిండిన నదిని దాటే ఆట ఆడుతున్నారు. ఆటకు వాళ్లే నియమాలు పెట్టుకున్నారు. సమస్యలు ఎదురైతే వాళ్లే పరిష్కరించుకున్నారు. అంతలో ఓ పెద్దాయన వచ్చి ఆ పలకలను ఎలా ఉపయోగించాలో చెప్పడంతో ఊహాజనిత ఆట అక్కడితో ఆగిపోయింది. కొద్ది నిమిషాల్లోనే పిల్లలు ఆసక్తి కోల్పోయారు.
పిల్లల ఆటలు ఎందుకు తగ్గుతున్నాయి?
గతంతో పోలిస్తే ఇప్పుడు పిల్లల జీవితంలో స్వేచ్ఛగా ఆడుకునే సమయం తగ్గిపోయింది. స్కూల్, ట్యూషన్లు, శిక్షణ తరగతులు, క్రీడా శిక్షణ, పర్యవేక్షణలో జరిగే ప్లే డేట్లు.. ఇలా ప్రతీది ముందే నిర్ణయించినట్టే సాగుతోంది. స్నేహితులతో కలిసి బయట తిరగడం, కొత్త ఆటలు కనిపెట్టడం, పెద్దల జోక్యం లేకుండా గడపడం క్రమంగా తగ్గిపోతోంది.
స్వేచ్ఛగా ఆడితే ..?
పిల్లలు తమంతట తామే ఆడుకుంటున్నప్పుడు కేవలం వినోదం మాత్రమే కాదు.. జీవితానికి అవసరమైన ఎన్నో నైపుణ్యాలు కూడా అలవడతాయి. నియమాలు రూపొందించడం, గొడవలు పరిష్కరించడం, రాజీ పడడం, ఓటమిని అంగీకరించడం, సమస్యలకు పరిష్కారం కనుగొనడం లాంటి లక్షణాలు సహజంగానే పెరుగుతాయి. ఊహాశక్తి, భాషా నైపుణ్యం, భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం కూడా మెరుగుపడతాయి.
ఆందోళనలకు ఇదే కారణమా?
ఇటీవలి కాలంలో పిల్లల్లో ఆందోళన, ఒత్తిడి, మానసిక సమస్యలు పెరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. దీనికి స్వేచ్ఛగా ఆడుకునే అవకాశాలు తగ్గిపోవడం కూడా ఒక కారణమై ఉండొచ్చని పీటర్ గ్రే అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదొక్కటే కారణమని చెప్పలేమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా, చదువుల ఒత్తిడి, నిద్రలేమి, జీవనశైలిలో మార్పులు కూడా ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నారు.
కొత్త అధ్యయనం ఏం చెబుతోంది?
ఆస్ట్రేలియాలో 2,200 మందికిపైగా చిన్నారులపై చేసిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. చిన్న వయసులో ఎక్కువసేపు స్వేచ్ఛగా ఆడుకున్న పిల్లల్లో రెండేళ్ల తర్వాత భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే సామర్థ్యం మెరుగ్గా కనిపించింది. ఇదే లక్షణం భవిష్యత్ చదువు, సంబంధాలు, మానసిక ఆరోగ్యానికి కీలకమని పరిశోధకులు చెబుతున్నారు.
పెద్దలు ఎప్పుడు వెనక్కి తగ్గాలి?
పిల్లలు తప్పు చేస్తారేమో, పడిపోతారేమో, గొడవపడతారేమో అన్న ఆందోళనతో తల్లిదండ్రులు వెంటనే జోక్యం చేసుకుంటారు. కానీ ప్రతి చిన్న సమస్యను పెద్దలే పరిష్కరిస్తే పిల్లలకు నేర్చుకునే అవకాశమే దక్కదు. చిన్న చిన్న విభేదాలు, విఫల ప్రయత్నాలు, స్వల్ప ప్రమాదాలు కూడా వారికి జీవిత పాఠాలే. అందుకే అవసరం లేని చోట జోక్యం తగ్గిస్తే పిల్లలు మరింత ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారని నిపుణులు సూచిస్తున్నారు.
చిన్న సంఘటన.. పెద్ద సందేశం
సైకాలజిస్ట్ పీటర్ గ్రే చెప్పిన ఓ సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇద్దరు ఆరేళ్ల చిన్నారులు చెక్క పలకలను వంతెనగా ఊహించుకుని, మొసళ్లతో నిండిన నదిని దాటే ఆట ఆడుతున్నారు. ఆటకు వాళ్లే నియమాలు పెట్టుకున్నారు. సమస్యలు ఎదురైతే వాళ్లే పరిష్కరించుకున్నారు. అంతలో ఓ పెద్దాయన వచ్చి ఆ పలకలను ఎలా ఉపయోగించాలో చెప్పడంతో ఊహాజనిత ఆట అక్కడితో ఆగిపోయింది. కొద్ది నిమిషాల్లోనే పిల్లలు ఆసక్తి కోల్పోయారు.
పిల్లల ఆటలు ఎందుకు తగ్గుతున్నాయి?
గతంతో పోలిస్తే ఇప్పుడు పిల్లల జీవితంలో స్వేచ్ఛగా ఆడుకునే సమయం తగ్గిపోయింది. స్కూల్, ట్యూషన్లు, శిక్షణ తరగతులు, క్రీడా శిక్షణ, పర్యవేక్షణలో జరిగే ప్లే డేట్లు.. ఇలా ప్రతీది ముందే నిర్ణయించినట్టే సాగుతోంది. స్నేహితులతో కలిసి బయట తిరగడం, కొత్త ఆటలు కనిపెట్టడం, పెద్దల జోక్యం లేకుండా గడపడం క్రమంగా తగ్గిపోతోంది.
స్వేచ్ఛగా ఆడితే ..?
పిల్లలు తమంతట తామే ఆడుకుంటున్నప్పుడు కేవలం వినోదం మాత్రమే కాదు.. జీవితానికి అవసరమైన ఎన్నో నైపుణ్యాలు కూడా అలవడతాయి. నియమాలు రూపొందించడం, గొడవలు పరిష్కరించడం, రాజీ పడడం, ఓటమిని అంగీకరించడం, సమస్యలకు పరిష్కారం కనుగొనడం లాంటి లక్షణాలు సహజంగానే పెరుగుతాయి. ఊహాశక్తి, భాషా నైపుణ్యం, భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం కూడా మెరుగుపడతాయి.
ఆందోళనలకు ఇదే కారణమా?
ఇటీవలి కాలంలో పిల్లల్లో ఆందోళన, ఒత్తిడి, మానసిక సమస్యలు పెరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. దీనికి స్వేచ్ఛగా ఆడుకునే అవకాశాలు తగ్గిపోవడం కూడా ఒక కారణమై ఉండొచ్చని పీటర్ గ్రే అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదొక్కటే కారణమని చెప్పలేమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా, చదువుల ఒత్తిడి, నిద్రలేమి, జీవనశైలిలో మార్పులు కూడా ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నారు.
కొత్త అధ్యయనం ఏం చెబుతోంది?
ఆస్ట్రేలియాలో 2,200 మందికిపైగా చిన్నారులపై చేసిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. చిన్న వయసులో ఎక్కువసేపు స్వేచ్ఛగా ఆడుకున్న పిల్లల్లో రెండేళ్ల తర్వాత భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే సామర్థ్యం మెరుగ్గా కనిపించింది. ఇదే లక్షణం భవిష్యత్ చదువు, సంబంధాలు, మానసిక ఆరోగ్యానికి కీలకమని పరిశోధకులు చెబుతున్నారు.
పెద్దలు ఎప్పుడు వెనక్కి తగ్గాలి?
పిల్లలు తప్పు చేస్తారేమో, పడిపోతారేమో, గొడవపడతారేమో అన్న ఆందోళనతో తల్లిదండ్రులు వెంటనే జోక్యం చేసుకుంటారు. కానీ ప్రతి చిన్న సమస్యను పెద్దలే పరిష్కరిస్తే పిల్లలకు నేర్చుకునే అవకాశమే దక్కదు. చిన్న చిన్న విభేదాలు, విఫల ప్రయత్నాలు, స్వల్ప ప్రమాదాలు కూడా వారికి జీవిత పాఠాలే. అందుకే అవసరం లేని చోట జోక్యం తగ్గిస్తే పిల్లలు మరింత ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారని నిపుణులు సూచిస్తున్నారు.