దలాల్ స్ట్రీట్లో 'బ్లడ్బాత్': 1500 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
- ట్రేడింగ్లో భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు
- 23,350 దిగువకు నిఫ్టీ
- అమెరికా ఫెడ్ నిర్ణయం, పెరుగుతున్న క్రూడాయిల్ ధరలే ప్రధాన కారణాలు
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో మరింత పతనం
- ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరి
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ తీసుకున్న నిర్ణయం మార్కెట్ సెంటిమెంట్ను తీవ్రంగా దెబ్బతీసింది. ద్రవ్యోల్బణం ఇంకా అదుపులోకి రాలేదని, వడ్డీ రేట్ల కోత ఇప్పట్లో ఉండకపోవచ్చని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలివ్వడం ప్రపంచ మార్కెట్లతో పాటు భారత్లోనూ అమ్మకాలకు దారితీసింది. దీనికి తోడు ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న యుద్ధ మేఘాలతో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 111 డాలర్ల మార్కును దాటడం భారత్ వంటి దిగుమతి ఆధారిత దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.
దేశీయంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్ రాజీనామా వార్తలతో ఆ బ్యాంక్ షేరు 5 శాతం వరకు పతనమవ్వడం కూడా సూచీలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఐటీ, బ్యాంకింగ్, ఆయిల్ & గ్యాస్ రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. మార్కెట్లలో అనిశ్చితి కొనసాగే అవకాశం ఉన్నందున, మదుపరులు ఆచితూచి వ్యవహరించాలని, నాణ్యమైన షేర్లను అట్టిపెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) నిధులను వెనక్కి తీసుకోవడం కూడా ఆందోళన పెంచుతోంది.