హోంగార్డు ఎగ్జామ్ రాస్తూ స్పృహ కోల్పోయిన మహిళ.. ఆసుపత్రికి తీసుకెళ్తూ అంబులెన్స్లో ఇద్దరు అత్యాచారం
సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) ఆనంద్ కుమార్ కథనం ప్రకారం.. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అంబులెన్స్ డ్రైవర్ వినయ్ కుమార్, టెక్నీషియన్ అజిత్ కుమార్లను రెండు గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో చార్జ్షీట్ దాఖలు చేస్తామని ఎస్ఎస్పీ తెలిపారు. ఫాస్ట్-ట్రాక్ ట్రయల్ ద్వారా నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.