డ్రగ్స్ కేసు.. కర్ణాటక మాజీ మంత్రి కుమారుడిపై లుకౌట్ నోటీసులు
- ఆదిత్య అల్వాపై నోటీసులు జారీ చేసిన సీసీబీ
- అన్ని ఎయిర్ పోర్టులను అలర్ట్ చేసిన అధికారులు
- పలువురు సినీ, టీవీ ఆర్టిస్టులకు సమన్లు
ఇదే సమయంలో దేశం నుంచి పారిపోయేందుకు కూడా అవకాశాలు ఉన్నాయనే అనుమానాలతో ముందస్తు జాగ్రత్తగా ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను అలర్ట్ చేశామని సీసీబీ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఈ కేసులో భాగంగా పలువురు సినీ, టీవీ ఆర్టిస్టులతో పాటు కొందరు క్రీడాకారులకు కూడా సమన్లు జారీ అయినట్టు తెలుస్తోంది. అయితే వీరి అరెస్టులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఇంకోవైపు ఇప్పటి వరకు 13 మందిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 7 మంది కోసం గాలిస్తున్నారు.