పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ పై దాడి.. ధ్వంసమైన కారు!
- టీఎంసీ మద్దతుదారులు దాడి చేశారన్న దిలీప్ ఘోష్
- సెక్యూరిటీ సిబ్బందిపై కూడా దాడి
- ప్రభుత్వంపై మండిపడ్డ దిలీప్
ఈ ఉదయం తమ పార్టీ కార్యకర్తలను కోచ్ పుకుర్ గ్రామంలోని ఓ టీ స్టాల్ వద్ద తాను కలవాల్సి ఉందని... తాను అక్కడకు చేరుకోక ముందే టీఎంసీ కార్యకర్తలు తనను అడ్డుకున్నారని దిలీప్ ఘోష్ తెలిపారు. తనపై చేయి చేసుకున్నారని... తన సెక్యూరిటీ గార్డ్ పై కూడా దాడి చేశారని చెప్పారు. తన పర్యటన గురించి పోలీసులకు ముందే సమాచారమిచ్చినప్పటికీ... వారు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని తెలిపారు.