Keerthy Suresh: రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసిన కీర్తి సురేశ్

Keerthy Suresh increases her remuneration

  • దక్షిణాదిన ఫుల్ బిజీగా ఉన్న కీర్తి సురేశ్
  • టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తున్న కీర్తి
  • 'దసరా' చిత్రానికి రూ. 3 కోట్లు తీసుకున్న కీర్తి

'మహానటి' సినిమాతో ఒక రేంజ్ కు వెళ్లిపోయిన కీర్తి సురేశ్... దక్షిణాది సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది. టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి 'సర్కారు  వారి పాట' చిత్రంలో నటిస్తోంది. మరోవైపు నాని సరసన 'దసరా' లో యాక్ట్ చేస్తోంది. 'భోళా శంకర్' చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు పాత్రను పోషిస్తోంది. తనకున్న ఫుల్ డిమాండ్ నేపథ్యంలో కీర్తి పారితోషికాన్ని భారీగా పెంచేసింది.

'దసరా' చిత్రానికి కీర్తి ఏకంగా రూ. 3 కోట్లు వసూలు చేసిందని ఫిలింనగర్ టాక్. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి శ్రీలక్ష్మీవేంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేశారు. ఈ చిత్రంలో నాని ఓ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు.

Keerthy Suresh
Tollywood
Remuneration
  • Loading...

More Telugu News