Twitter: ప్రధానిని విమర్శించినా స్వాగతిస్తాం... నిబంధనలు మాత్రం పాటించాల్సిందే: ట్విట్టర్ కు తేల్చిచెప్పిన కేంద్రం

Union IT Ministry warns Twitter

  • కేంద్రం వర్సెస్ ట్విట్టర్
  • ఘాటు వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఐటీ మంత్రి
  • 3 నెలల సమయం ఇచ్చామని వెల్లడి
  • ట్విట్టర్ స్పందించలేదని ఆరోపణ
  • ఏమిటి ఇబ్బంది? అని ఆగ్రహం

ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ కు, కేంద్రానికి మధ్య నడుస్తున్న వివాదంపై ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. కొత్త ఐటీ చట్టం అమలుకు ట్విట్టర్ కు తగిన సమయం ఇచ్చామని వెల్లడించారు. 3 నెలల సమయం ఇచ్చినా ట్విట్టర్ స్పందించలేదని ఆరోపించారు. ఇతర సంస్థలు ఐటీ చట్టాన్ని పాటిస్తుంటే ట్విట్టర్ కు అభ్యంతరమేంటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముగ్గురు ప్రత్యేక అధికారులను నియమించాలని ట్విట్టర్ ను అడిగామని, ట్విట్టర్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని తెలిపారు. భారత సంస్థలు అమెరికాలో నిబంధనలు పాటిస్తున్నాయని, అలాంటిది ట్విట్టర్ కు భారత్ లో నిబంధనలు పాటించడంలో వచ్చిన ఇబ్బంది ఏమిటని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రశ్నించారు. భారత్ లో వ్యాపారం చేయాలంటే నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రధానిని విమర్శించినా స్వాగతిస్తాం... కానీ నిబంధనలు పాటించడం మాత్రం తప్పనిసరి అని ట్విట్టర్ కు తేల్చి చెప్పారు.

Twitter
IT Rules
New Policy
Ravishankar
India
  • Loading...

More Telugu News