హరీశ్రావు చాపకింద నీరులా పావులు కదుపుతున్నారు: విజయశాంతి
- జనం సమస్యలతో బాధపడుతుంటే వీరు పదవుల కోసం కొట్టాడుకుంటున్నారు
- జీహెచ్ఎంసీ ఇంకా కేటీఆర్ కనుసన్నల్లోనే నడుస్తోంది
- ప్రజల జీవితాలతో కేసీఆర్ అండ్ కో ఆడుకుంటున్నారు
జీహెచ్ఎంసీ, మునిసిపల్ వ్యవస్థలు ఇప్పటికీ కేటీఆర్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయని, ఈ విషయం అందరికీ తెలిసిందేనన్నారు. రాష్ట్రం వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే మాజీ మంత్రి హరీశ్రావు మాత్రం సందట్లో సడేమియాలా ముఖ్యమంత్రి పీఠం కోసం పావులు కదుపుతున్నారని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రి కావడం కోసం అనుచరులతో కొబ్బరికాయలు కొట్టిస్తూ చాపకింద నీరులా పావులు కదుపుతున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అంటూ అధికారంలోకి వచ్చిన ‘కేసీఆర్ అండ్ కో’ అధికార దాహంతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విజయశాంతి మండిపడ్డారు.