టీమిండియాలో అతడికి బౌలింగ్ వేయడం చాలా కష్టమన్న కమిన్స్.. కోహ్లీ, రోహిత్ మాత్రం కాదు!
- పుజారానే కఠినమైన భారత బ్యాటర్ అన్న కమిన్స్
- కోహ్లీ, రోహిత్ పేర్లు చెప్పని కమిన్స్
- పుజారాను ఔట్ చేయడం చాలా కష్టమన్న ఆస్ట్రేలియా బౌలర్
- 100 డాట్ బాల్స్ ఆడేందుకైనా పూజారా సిద్ధంగా ఉంటాడని వ్యాఖ్య
- అతడికి బౌలింగ్ వేస్తే చిన్న చిన్న దెబ్బలతో క్రమంగా చావగొట్టినట్లు ఉంటుందని సరదా వ్యాఖ్య
భారత క్రికెట్లో తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్ ఎవరంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు చెప్పలేదు ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్. మాజీ బ్యాటర్ చతేశ్వర్ పుజారానే తనకు అత్యంత కష్టమైన ప్రత్యర్థి అని చెప్పాడు. పుజారాను ఔట్ చేయడం ‘చిన్న చిన్న గాయాలతో క్రమంగా చావగొట్టినట్లు’ అనిపించేదని సరదాగా వ్యాఖ్యానించాడు.
ఇటీవల ‘ప్రైమ్ వీడియో స్పోర్ట్’తో జరిగిన సంభాషణలో కమిన్స్ను వివిధ దేశాల నుంచి తాను ఎదుర్కొన్న కఠినమైన ఆటగాళ్ల పేర్లు చెప్పమని అడిగారు. భారత్ నుంచి పుజారాను ఎంచుకున్నాడు.
“పుజారా చాలా కష్టంగా ఔట్ అవుతాడు. అతను 100 డాట్ బాల్స్ ఆడాల్సి వచ్చినా సిద్ధంగా ఉంటాడు. మీకు ఎలాంటి అవకాశం ఇవ్వడు. అతనితో బౌలింగ్ చేయడం అంటే చిన్న చిన్న దెబ్బలతో క్రమంగా చావగొట్టినట్లు ఉంటుంది” అని కమిన్స్ చెప్పాడు.
ఆస్ట్రేలియాపై భారత్ సాధించిన 2018-19, 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విజయాల్లో పుజారా కీలక పాత్ర పోషించాడు. ఆ సిరీస్ల్లో అతడి ఓపిక, డిఫెన్సివ్ గేమ్ ఆస్ట్రేలియా బౌలర్లకు పెద్ద సవాలుగా నిలిచింది.
ఇతర దేశాల నుంచి కూడా పలువురు మాజీ ఆటగాళ్లను కమిన్స్ గుర్తుచేసుకున్నాడు. పాకిస్థాన్ నుంచి సయీద్ అజ్మల్, ఇంగ్లాండ్ నుంచి అలిస్టర్ కుక్, దక్షిణాఫ్రికా నుంచి ఏబీ డివిలియర్స్, న్యూజిలాండ్ నుంచి బ్రెండన్ మెకల్లమ్, శ్రీలంక నుంచి తిలకరత్నే దిల్షాన్, వెస్టిండీస్ నుంచి క్రిస్ గేల్ను ఎంపిక చేశాడు.
కమిన్స్ చెప్పిన జాబితాలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లే ఉండటం విశేషం. పుజారా 2025లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరఫున 103 టెస్టులు ఆడి 7,195 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఐదు వన్డేల్లో 51 పరుగులు చేశాడు.
ఇటీవల ‘ప్రైమ్ వీడియో స్పోర్ట్’తో జరిగిన సంభాషణలో కమిన్స్ను వివిధ దేశాల నుంచి తాను ఎదుర్కొన్న కఠినమైన ఆటగాళ్ల పేర్లు చెప్పమని అడిగారు. భారత్ నుంచి పుజారాను ఎంచుకున్నాడు.
“పుజారా చాలా కష్టంగా ఔట్ అవుతాడు. అతను 100 డాట్ బాల్స్ ఆడాల్సి వచ్చినా సిద్ధంగా ఉంటాడు. మీకు ఎలాంటి అవకాశం ఇవ్వడు. అతనితో బౌలింగ్ చేయడం అంటే చిన్న చిన్న దెబ్బలతో క్రమంగా చావగొట్టినట్లు ఉంటుంది” అని కమిన్స్ చెప్పాడు.
ఆస్ట్రేలియాపై భారత్ సాధించిన 2018-19, 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విజయాల్లో పుజారా కీలక పాత్ర పోషించాడు. ఆ సిరీస్ల్లో అతడి ఓపిక, డిఫెన్సివ్ గేమ్ ఆస్ట్రేలియా బౌలర్లకు పెద్ద సవాలుగా నిలిచింది.
ఇతర దేశాల నుంచి కూడా పలువురు మాజీ ఆటగాళ్లను కమిన్స్ గుర్తుచేసుకున్నాడు. పాకిస్థాన్ నుంచి సయీద్ అజ్మల్, ఇంగ్లాండ్ నుంచి అలిస్టర్ కుక్, దక్షిణాఫ్రికా నుంచి ఏబీ డివిలియర్స్, న్యూజిలాండ్ నుంచి బ్రెండన్ మెకల్లమ్, శ్రీలంక నుంచి తిలకరత్నే దిల్షాన్, వెస్టిండీస్ నుంచి క్రిస్ గేల్ను ఎంపిక చేశాడు.
కమిన్స్ చెప్పిన జాబితాలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లే ఉండటం విశేషం. పుజారా 2025లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరఫున 103 టెస్టులు ఆడి 7,195 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఐదు వన్డేల్లో 51 పరుగులు చేశాడు.