భారత్పై 100 శాతం సుంకాలు?.. రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా కీలక బిల్లు!
- రష్యా చమురు కొనుగోలుదారులే లక్ష్యంగా అమెరికా బిల్లు
- భారత్ నుంచి దిగుమతులపై 100 శాతం సుంకాలు విధించే అవకాశం
- ప్రతినిధుల సభలో కీలక అడ్డంకిని దాటిన బిల్లు.. నేడు తుది ఓటింగ్
- సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చే అధికారం అధ్యక్షుడికి
- భారత్తో పాటు చైనా, హంగేరి వంటి దేశాలపైనా ప్రభావం
రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు అమెరికా సిద్ధమవుతోంది. రష్యా నుంచి అధిక మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్న భారత్ వంటి దేశాలపై ఏకంగా 100 శాతం వరకు దిగుమతి సుంకాలు (టారిఫ్లు) విధించడానికి వీలు కల్పించే కీలక బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో మార్గం సుగమమైంది.
'లిండ్సే గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026' పేరుతో రూపొందించిన ఈ బిల్లుకు సంబంధించిన కీలక తీర్మానం మంగళవారం స్వల్ప మెజారిటీతో ఆమోదం పొందింది.
ప్రతినిధుల సభలో ఈ తీర్మానానికి అనుకూలంగా 214 ఓట్లు, వ్యతిరేకంగా 211 ఓట్లు వచ్చాయి. ఇద్దరు డెమొక్రాట్లు రిపబ్లికన్లతో కలిసి ఓటు వేయడంతో బిల్లు తుది ఓటింగ్కు సిద్ధమైంది. బుధవారం ఈ బిల్లుపై తుది ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే ఈ బిల్లును అమెరికా సెనేట్ 86-11 ఓట్ల భారీ ఆధిక్యంతో ఆమోదించింది.
దీంతో ప్రతినిధుల సభలో కూడా ఆమోదం పొందితే, ఇది చట్టంగా మారనుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే, రష్యా నుంచి అత్యధికంగా చమురు లేదా సహజవాయువును దిగుమతి చేసుకుంటున్న ఐదు దేశాల నుంచి వచ్చే వస్తువులపై 100 శాతం వరకు టారిఫ్లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు లభిస్తుంది.
ఈ బిల్లులో ఎక్కడా భారత్ పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. అయితే, ప్రస్తుతం రష్యా నుంచి అధికంగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాల జాబితాలో భారత్ ఉంది. ఈ చట్టం అమల్లోకి వచ్చాక కూడా భారత్ టాప్-5 కొనుగోలుదారుల జాబితాలో కొనసాగితే, ఈ సుంకాల నిబంధన పరిధిలోకి వచ్చే ప్రమాదం ఉంది.
భారత్తో పాటు చైనా, అజర్బైజాన్, హంగేరి, స్లోవేకియా వంటి దేశాలు కూడా ఈ కేటగిరీలో ఉన్నాయి. అయితే, ఈ సుంకాల నుంచి దేశాలకు మినహాయింపు ఇచ్చే అధికారాన్ని కూడా ఈ బిల్లు అధ్యక్షుడికి కల్పిస్తోంది.
ఉక్రెయిన్పై యుద్ధానికి నిధులు సమకూర్చుకుంటున్న రష్యా ఇంధన ఆదాయాన్ని దెబ్బతీయడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని దీని సమర్థకులు చెబుతున్నారు. మరోవైపు, అధ్యక్షుడికి ఇంత విస్తృతమైన టారిఫ్ అధికారాలు ఇవ్వడంపై కొందరు డెమొక్రాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ బిల్లు రష్యా నాయకత్వం, ఇంధన రంగం, చమురు రవాణాకు వాడే 'షాడో ఫ్లీట్' నౌకలపై అదనపు ఆంక్షలు విధించడంతో పాటు ఇరాన్పై ఉన్న ఆంక్షలను కూడా పొడిగించనుంది. గురువారం తర్వాత ప్రతినిధుల సభ సమావేశాలు విరామంలోకి వెళ్లనున్న నేపథ్యంలో ఈ బిల్లు భవితవ్యం నేడు తేలిపోనుంది.
'లిండ్సే గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026' పేరుతో రూపొందించిన ఈ బిల్లుకు సంబంధించిన కీలక తీర్మానం మంగళవారం స్వల్ప మెజారిటీతో ఆమోదం పొందింది.
ప్రతినిధుల సభలో ఈ తీర్మానానికి అనుకూలంగా 214 ఓట్లు, వ్యతిరేకంగా 211 ఓట్లు వచ్చాయి. ఇద్దరు డెమొక్రాట్లు రిపబ్లికన్లతో కలిసి ఓటు వేయడంతో బిల్లు తుది ఓటింగ్కు సిద్ధమైంది. బుధవారం ఈ బిల్లుపై తుది ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే ఈ బిల్లును అమెరికా సెనేట్ 86-11 ఓట్ల భారీ ఆధిక్యంతో ఆమోదించింది.
దీంతో ప్రతినిధుల సభలో కూడా ఆమోదం పొందితే, ఇది చట్టంగా మారనుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే, రష్యా నుంచి అత్యధికంగా చమురు లేదా సహజవాయువును దిగుమతి చేసుకుంటున్న ఐదు దేశాల నుంచి వచ్చే వస్తువులపై 100 శాతం వరకు టారిఫ్లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు లభిస్తుంది.
ఈ బిల్లులో ఎక్కడా భారత్ పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. అయితే, ప్రస్తుతం రష్యా నుంచి అధికంగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాల జాబితాలో భారత్ ఉంది. ఈ చట్టం అమల్లోకి వచ్చాక కూడా భారత్ టాప్-5 కొనుగోలుదారుల జాబితాలో కొనసాగితే, ఈ సుంకాల నిబంధన పరిధిలోకి వచ్చే ప్రమాదం ఉంది.
భారత్తో పాటు చైనా, అజర్బైజాన్, హంగేరి, స్లోవేకియా వంటి దేశాలు కూడా ఈ కేటగిరీలో ఉన్నాయి. అయితే, ఈ సుంకాల నుంచి దేశాలకు మినహాయింపు ఇచ్చే అధికారాన్ని కూడా ఈ బిల్లు అధ్యక్షుడికి కల్పిస్తోంది.
ఉక్రెయిన్పై యుద్ధానికి నిధులు సమకూర్చుకుంటున్న రష్యా ఇంధన ఆదాయాన్ని దెబ్బతీయడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని దీని సమర్థకులు చెబుతున్నారు. మరోవైపు, అధ్యక్షుడికి ఇంత విస్తృతమైన టారిఫ్ అధికారాలు ఇవ్వడంపై కొందరు డెమొక్రాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ బిల్లు రష్యా నాయకత్వం, ఇంధన రంగం, చమురు రవాణాకు వాడే 'షాడో ఫ్లీట్' నౌకలపై అదనపు ఆంక్షలు విధించడంతో పాటు ఇరాన్పై ఉన్న ఆంక్షలను కూడా పొడిగించనుంది. గురువారం తర్వాత ప్రతినిధుల సభ సమావేశాలు విరామంలోకి వెళ్లనున్న నేపథ్యంలో ఈ బిల్లు భవితవ్యం నేడు తేలిపోనుంది.