అమరావతి రైతులు ఇచ్చిన భూముల్లోనే రాజధాని నిర్మిస్తున్నాం: సీఎం చంద్రబాబు
- రాజధాని అమరావతిపై వైసీపీ విమర్శలను తిప్పికొట్టాలని చంద్రబాబు ఆదేశం
- కేంద్ర ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పిస్తోందని ప్రజలకు వివరించాలని సూచన
- వైసీపీ 'మూడు ముక్కలాట' వల్లే రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందన్న సీఎం
గత వైసీపీ ప్రభుత్వం ఆడిన మూడు ముక్కలాట వల్ల రాష్ట్రానికి రాజధాని లేకుండా పోవడమే కాకుండా, పెట్టుబడిదారులు కూడా దూరమయ్యారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని సూచించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాలపై కూడా వైసీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని, పూర్వోదయ పథకంతో రాయలసీమ రూపురేఖలు మారతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇదే సమావేశంలో, చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను బుధవారం నుంచి అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.