వినాయక చవితి వేళ తియ్యని కబురు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
- గణేశ్ మండపాలకు, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- అనుమతి ఉన్న మండపాలకే ఈ సౌకర్యం వర్తింపు
- ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న వినాయక చవితి ఉత్సవాలు
- వేగంగా జరుగుతున్న హైదరాబాద్ గణేశ్ మండపాల ఏర్పాటు
- తుది దశకు చేరిన ప్రఖ్యాత ఖైరతాబాద్ గణపతి విగ్రహం పనులు
ఈ నెల 27వ తేదీ నుంచి గణేశ్ చతుర్థి ఉత్సవాలు ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ నిర్ణయంపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మండపాల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిర్మాణ పనులు తుది ఘట్టానికి చేరుకున్నాయి.
ప్రభుత్వం ఉచిత విద్యుత్ను ప్రకటించడంతో ఈ ఏడాది ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు వీలు కలుగుతుందని భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో మండపాలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది.