జ్ఞానపీఠ్ అవార్డు పురస్కారానికి ఎంపికైన హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా
- ఛత్తీస్గఢ్ నుంచి అత్యున్నత సాహిత్య పురస్కారం అందుకున్న మొదటి రచయిత శుక్లా
- సాహిత్యానికి అందించిన విశిష్ఠ సేవలకు గుర్తింపుగా జ్ఞానపీఠ్ అవార్డు అందజేత
- దేశంలో అత్యున్నత సాహిత్య అవార్డు జ్ఞానపీఠ్
భారతీయ సాహిత్యానికి ఆయన చేసిన విశేషమైన సేవలకు గుర్తింపుగా ఈ జ్ఞానపీఠ్ అవార్డును ప్రదానం చేయనున్నారు. దేశంలోనే ఇది అత్యున్నతమైన సాహిత్య పురస్కారంగా పరిగణించబడుతుంది. ఈ అవార్డుకు ఎంపికైన 12వ హిందీ రచయితగా శుక్లా గుర్తింపు పొందారు. ఈ పురస్కారంలో భాగంగా రూ. 11 లక్షల నగదు బహుమతితో పాటు, సరస్వతి కాంస్య విగ్రహాన్ని అందజేస్తారు.
హిందీ సాహిత్యంలో ఆయన చేసిన కృషికి, ఆయన యొక్క విలక్షణమైన రచనా శైలికి గాను ఈ అవార్డు లభించింది. ఇదివరకే, 1999లో ఆయన సాహిత్య అకాడమీ అవార్డును కూడా అందుకున్నారు.