మాజీ ప్రధాని మన్మోహన్ పై పవార్ కీలక వ్యాఖ్యలు
- రైతుల సమస్యల పట్ల సున్నితంగా వ్యవహరించారని కితాబు
- రూ.72 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశారని వెల్లడి
- ప్రస్తుతం రైతులను పట్టించుకునే వారే లేరని ఆవేదన
మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే అప్పుడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ స్వయంగా అక్కడ పర్యటించారని పవార్ గుర్తుచేశారు. కాగా, ఈ కార్యక్రమంలో శరద్ పవార్ తో పాటు శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ థాక్రే, ఎంపీ సంజయ్ రౌత్, కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరట్, ఎన్సీపీ ఎంపీ, పవార్ కూతురు సుప్రియా సూలే తదితరులు హాజరయ్యారు.