యువత కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం సరికొత్త పథకం
- యువతకు నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు కొత్త పథకం
- మేరా యువ భారత్/మై భారత్ పేరుతో స్వయంప్రతిపత్తి కలిగిన వేదిక
- అక్టోబర్ 31న కార్యక్రమం ప్రారంభం
యువత నైపుణ్యాభివృద్ధికి ఒక డిజిటల్ వేదికను తీసుకురావడమే మేరా యువ భారత్ లక్ష్యమని తెలిపారు. యువత తమకు కావాల్సిన అవకాశాలను పొందడంతో పాటు సుసంపన్న భారత్ ఏర్పాటుకు ప్రభుత్వానికి, పౌరులకు మధ్య వారధులుగా వ్యవహరిస్తారన్నారు. ఈ వేదిక ద్వారా 15 నుంచి 29 ఏళ్ల వయస్సు ఉన్న వారికి ప్రయోజనం ఉంటుందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా అక్టోబర్ 31న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అలాగే, కేబినెట్ భేటీలో కొన్ని ఖనిజాలకు సంబంధించి రాయల్టీ రేట్లను నిర్ణయించారు. లిథియం, నియోబియం మూడు శాతం, అరుదుగా లభించే మరో ఖనిజంకు ఒక శాతం రాయల్టీ విధించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.