సీఎం జగన్ తో టీమిండియా యువ క్రికెటర్ భేటీ
- తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కలిసిన కేఎస్ భరత్
- భారత ఆటగాళ్లు సంతకాలు చేసిన జెర్సీ సీఎంకు బహూకరణ
- ఇటీవలే జగన్ ను కలిసి అంబటి రాయుడు
భవిష్యత్లో జట్టుకు ఎన్నో విజయాలను సాధించి పెట్టాలని ఆకాంక్షించారు. అనంతరం భరత్ మాట్లాడుతూ వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఏపీ నుంచి భారత జట్టులో అవకాశం పొందిన తొలి ఆటగాడు తానేననని చెప్పాడు. అందుకు తాను గర్వపడుతున్నానని అన్నాడు. జగన్ పాలనలో క్రీడల అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు, స్పోర్ట్స్ ప్రమోషన్ బాగుందని కొనియాడాడు. కాగా, ఈ మధ్యే మరో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు.. చెన్నై సూపర్ కింగ్స్ యజమానితో కలిసి జగన్ తో సమావేశమైన సంగతి తెలిసిందే.