పొలంలో వరి నాటు వేసిన బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్!... వీడియో ఇదిగో!
- కరీంనగర్ జిల్లాలో సాగుతున్న ప్రవీణ్ పాదయాత్ర
- మల్లారెడ్డిపల్లిలో వరి నాట్లు వేసిన బీఎస్పీ నేత
- 10 నిమిషాలు కూడా వంగి నాటు వేయడం కష్టమైందని వ్యాఖ్య
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్... జిల్లాలోని వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి మీదుగా వెళుతున్న సందర్భంగా పొలాల్లో వరి నాట్లు వేస్తున్న మహిళలతో మాట కలిపారు. ఈ సందర్భంగా ఆయన మహిళలతో కలిసి వరి నాట్లు వేశారు. కనీసం 10 నిమిషాలు కూడా వంగి నాటు వేయడం కష్టమైందని పేర్కొన్న ప్రవీణ్.. ఈ తల్లులు రోజు 6గంటలు కష్టపడితే కేవలం రూ.300 వస్తాయని వ్యాఖ్యానించారు. దొరలు మాత్రం నడుం వంచకుండానే వేల కోట్లు ఎలా సంపాదిస్తున్నారని, శ్రామికులకు సంపద రావాలంటే తెలంగాణలో బీఎస్పీ గెలవాలని ఆయన అన్నారు.