జగన్ వల్లే ప్రత్యేక హోదా అంశం ఇప్పటికీ సజీవంగా ఉంది: ఏపీ మంత్రి బాలినేని
- వైసీపీ అభ్యర్థికి మద్దతుగా తిరుపతిలో ప్రచారం
- సీఎంపై ప్రశంసల జల్లు
- పార్లమెంటులో స్వరం వినిపించేందుకు గురుమూర్తిని గెలిపించాలని విజ్ఞప్తి
- ప్రతిపక్షాలపై విమర్శలు
ప్రజలను వంచించేందుకు తోడేళ్ళలా కాచుక్కూర్చున్నారంటూ ప్రతిపక్ష పార్టీలపై బాలినేని విరుచుకుపడ్డారు. అలాంటి పార్టీలకు సరైన గుణపాఠం చెప్పాలన్నారు. బీజేపీ, తెదేపా అభ్యర్థులను గెలిపించడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ పెద్దలు దిగివచ్చేలా ఇక్కడి ఓటర్లు తీర్పు చెప్పాలన్నారు.