ఏపీ పురపాలక ఎన్నికల నేపథ్యంలో.. రేపటి నుంచి ఎస్ఈసీ ఆధ్వర్యంలో ప్రాంతీయ సమావేశాల నిర్వహణ!
- పురపాలిక ఎన్నికలపై ప్రాంతాల వారీ సమావేశాలకు నిర్ణయం
- అధికార యంత్రాంగం సన్నద్ధత కోసమే
- ఈ నెల 27, 28, మార్చి 1న ప్రాంతీయ సమావేశాలు
ఈ నెల 27, 28, మార్చి 1న ప్రాంతీయ సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఈ నెల 27న తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో సమావేశం నిర్వహిస్తామని వివరించింది.
ఈ సమావేశాల్లో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, మునిసిపల్ కమిషనర్లు, ఇతర అధికారులతో ఎస్ఈసీ సమావేశం కానుంది. అలాగే, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. ఈ నెల 27న (రేపు) ఐదు జిల్లాల్లో రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఉంటుంది. అనంతరం, ఎల్లుండి విజయవాడలోని కార్యాలయంలో ఎస్ఈసీ సమావేశం నిర్వహిస్తుంది. ఇందులో మిగిలిన జిల్లాల అధికారులు పాల్గొంటారు.