జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన మద్దతు ఎవరికో చెప్పిన నటుడు పోసాని కృష్ణమురళి
- టీఆర్ఎస్ కే ఓటు వేయండి
- టీఆర్ఎస్ అభ్యర్థిని మేయర్ చేయండి
- కేసీఆర్ వల్లే హైదరాబాద్ ప్రజలు సురక్షితంగా ఉన్నారు
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని హైదరాబాద్ నగరవాసులను పోసాని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థిని మేయర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. 35 ఏళ్ల నుంచి తాను ఎంతో మంది నాయకులను, ముఖ్యమంత్రులను చూశానని... కానీ, ఎన్టీఆర్ సీఎం అయ్యాక హైదరాబాదులో మత ఘర్షణలు తగ్గాయని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. నగర ప్రజలు సురక్షితంగా ఉన్నారంటే అది కేసీఆర్ వల్లే అని అన్నారు. నగరాభివృద్ధి కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరారు.