Kalyan Jewellers: కల్యాణ్ జ్యుయెలర్స్ యజమాని ఇంట నవరాత్రి వేడుకలకు చిరంజీవి, నాగార్జున... ఫొటోలు ఇవిగో!

Chiranjeevi and Nagarjuna attends Kalyan Jewellers Navaratri celebrations

  • కేరళలోని త్రిసూర్ లో టీఎస్ కల్యాణరామన్ ఇంట దసరా సంబరాలు
  • చిరంజీవి, నాగార్జునలకు ప్రత్యేక ఆహ్వానం
  • కల్యాణ్ జ్యుయెలరీ అధినేత ఇంట సందడి చేసిన చిరు, నాగ్

ప్రముఖ బంగారు, వెండి ఆభరణాల తయారీదారు కల్యాణ్ జ్యుయెలర్స్ సంస్థ యజమాని టీఎస్ కల్యాణరామన్ ఇంట దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కేరళలోని త్రిసూర్ లో జరిగిన ఈ శరన్నవరాత్రి సంబరాలకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కూడా హాజరయ్యారు. 

కల్యాణ్ జ్యుయెలర్స్ ఎండీ టీఎస్ కల్యాణరామన్ ఆహ్వానం మేరకు చిరంజీవి, నాగార్జున ప్రత్యేక విమానంలో త్రిసూర్ వెళ్లారు. ఈ వేడుకల్లో కల్యాణరామన్ తో కలిసి చిరంజీవి, నాగార్జున జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం బొమ్మల కొలువును సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News